8.9 C
New York
Monday, December 4, 2023

Buy now

V2link Ads

గవర్నర్ – కేసీఆర్ మధ్య వార్ స్టార్ట్ అయింది.. ఇక చూడాలి..

V2link Ads

తెలంగాణాలో ముఖ్యమంత్రి కేసీఆర్ కి , గవర్నర్ తమిళసై కి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది.. సోమవారం నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాలను , గవర్నర్ ప్రసంగం లేకుండానే మొదలు పెడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం ఇలా చేయడాన్ని గవర్నర్ కార్యాలయం బహిరంగంగానే తప్పు పట్టింది. ఫైనాన్స్ బిల్లుని , గవర్నర్ ఆమోదించిన తరువాతనే , గవర్నర్ ప్రసంగంతో , బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడం ఆనవాయితీ.. ఫైనాన్స్ బిల్లుని , తన ఆమోదంకోసం పంపేప్పుడుకూడా , గవర్నర్ ప్రసంగంతో , అసెంబ్లీ సమావేశాలు మొదలవుతాయని చెప్పారని గుర్తుచేశారు.

ప్రభుత్వం , ఆ మాటను పక్కనబెట్టి , సాంప్రదాయానికి తిలోదకాలు ఇచ్చినా , ప్రజా శ్రేయస్సు దృష్ట్యా , బిల్లుని ఆమోదించి పంపానని , ఈ విషయాన్ని ప్రభుత్వం విజ్ఞతకే వదిలేస్తున్నామని గవర్నర్ కార్యాలయం తెలిపింది. ఫెడరల్ వ్యవస్థలో ఇది మంచి సాంప్రదాయం కాదని చెప్పింది. అయితే కేసీఆర్ ప్రభుత్వం గవర్నర్ వాదనను ఖండించింది.

ఇవి కొత్త సమావేశాలు కాదని , ఐదు నెలలక్రితం ఆగిపోయిన సమావేశాలకు కొనసాగింపుగా జరిగేవని , వీటిలో గవర్నర్ ప్రసంగం ఉండదని చెప్పింది. అప్పుడు సమావేశాలు ప్రోరోగ్ చేయలేదని అందువల్ల , వాటిని కొనసాగింపుగానే భావించాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి అంటున్నారు.. మొత్తానికి తెలంగాణాలో , ప్రభుత్వం , గవర్నర్ మధ్య డైరెక్ట్ వార్ మొదలయింది.. పర్యవసానం ఎలాఉంటుందో చూడాలి..

ఇవీ చదవండి… 

బాబూ , బాబూ అంటూ ముద్దాడుతూ రోదిస్తున్న గౌతంరెడ్డి తల్లి

మిస్ యూ గౌతమ్.. ఎమోషనల్ అవుతున్న బాల్య మిత్రులు..

నా భార్య చీటర్.. ఆమె మోసాలతో నాకు సంబంధం లేదు..

తాళి కట్టాక పెళ్లి కూతురు సినిమా చూపించింది..

V2link Ads

Related Articles

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles