8.9 C
New York
Tuesday, December 5, 2023

Buy now

V2link Ads

ఐఏఎస్ అధికారి ఇంట్లో బంగారు , వెండి ఇటుకలు..

V2link Ads

అవినీతిపరులైన అధికారుల లంచాల కక్కుర్తి లో ఇది మరో సంచలనం . ఇటీవలే పాట్నాలో జితేంద్ర అనే ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్ ఇంట్లో 3 కోట్ల రూపాయలు కరెన్సీ కట్టలను అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే . ఒక ఏడాదిలో లంచాల రూపంలో సంపాదించిన డబ్బు ఇంత అని తెలిస్తే మనం ఆశ్చర్యపోక తప్పదు . ఇప్పుడు మరో సంచలనం ,

సంజయ్ పోలి అనే ఐఏఎస్ అధికారి ఇంటిపై విజిలెన్స్ దాడి చేసిన సందర్భంగా ఆ ఇంటి నుంచి 20 కోట్లు రూపాయలు విలువచేసే బంగారం , వెండి ఇటుకలు స్వాధీనం చేసుకున్నారు . లంచంగా తీసుకుంటున్న డబ్బును ఎలా ఖర్చు పెట్టాలో, ఎక్కడ దాచిపెట్టాలో తెలీక ఆ డబ్బుతో బంగారు , వెండి ఇటుకలు తయారు చేశాడు .

వాటిని తన ఇంట్లో స్టార్ రూమ్ లో పెట్టేసాడు. దాడిలో 12 కిలోల బంగారం నాలుగు కిలోల వెండి ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నారు . ఇవి కాకుండా 49 బంగారం బిస్కెట్లు 12 బంగారు కాయిన్స్ స్వాధీనం చేసుకున్నారు . ఈ ఈ సోదాలు జరుగుతున్నప్పుడు ఐఏఎస్ అధికారి కొడుకు కాల్చుకొని చనిపోయిన విషయం కూడా సంచలనమైంది.

ఇదికూడా చదవండి..
11 ఏళ్లలోనే 100 కోట్లకు పైగా సంపాదించినా డ్రగ్ ఇన్స్పెక్టర్..

=======================

ఇన్స్పెక్టర్ ఉద్యోగంలో చేరి నాలుగేళ్లయింది. జితేంద్ర , ఉద్యోగంలో చేరి 11 సంవత్సరాలు అయింది. ఈ పదకొండు సంవత్సరాల్లో ఆయన ఎంత సంపాదించాడో తెలుసా ..? దాదాపు 60 కోట్ల రూపాయలకు పైగానే సంపాదించి , ఆ డబ్బులు ఇంట్లో కరెన్సీ కట్టలుగా పేర్చి పెట్టాడు. ఆ అమౌంట్ ఎంతో తెలుసా.. ? అక్షరాలా మూడుకోట్ల రూపాయలు నోట్ల కట్టలు ఈ అధికారి ఇంట్లో బయట పడ్డాయి.బీహార్ లో డ్రగ్ ఇన్స్పెక్టర్ గా పని చేసే జితేంద్రకుమార్ అవినీతి కి మరో పేరు . ఎక్కడ పని చేసినా , మందులు బ్లాక్ మార్కెట్ చేసినా పట్టించుకోకుండా లంచాలు వసూలు చేయడమే పనిగా పెట్టుకున్నాడు .

కరోనా సమయంలో కూడా మందులు బ్లాక్ మార్కెట్ వ్యాపారం చేసే వాళ్ళనుంచి పెద్దమొత్తంలో డబ్బులు గుంజేసాడు. అలా సంపాదించుకున్న మూడు కోట్ల రూపాయలు డబ్బులు కరెన్సీగా కట్టలు కట్టి పెట్టాడు.ఇది కాకుండా మార్కెట్ విలువ ప్రకారం 112 కోట్ల రూపాయలకు పైగానే ఆస్తులు సంపాదించాడు. ఈ 11 ఏళ్లలో ఆస్తులు ,కూడగట్టుకున్న డబ్బు, బంగారం భవనాలు భూములు వీటన్నింటి మించి , ఏడు బ్యాంకుల్లో లాకర్లు ఇప్పుడు ఓపెన్ చేస్తే మరిన్ని రహస్యాలు బయట పడతాయని భావిస్తున్నారు వీడికి ఒక ప్రత్యేకంగా ఫార్మసీ కాలేజీ కూడా ఉందట.

 

ఇవి కూడా చదవండి..

మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.

V2link Ads

Related Articles

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles